Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ


ఈ ఘటన చూసి పోలీసులు తక్కువ సమయంలో మహిళను పట్టుకుని శిశువును తల్లికి అప్పగించారు. ఈ ఘటన వెనుక కారణం ఏమిటి అనే వివాదాత్మక చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా తీసుకుంటున్నారు మరియు కేసును త్వరగా తనిఖీ చేస్తున్నారు. మహిళా సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం కోసం ప్రభుత్వానికి ఆవేదన చేస్తున

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి (Govt. Hospital)లో దారుణం (Atrocious) జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు (Police) ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల‌ క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటుంది. రాత్రి 1:30 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ నర్స్ వేషంలో ఆస్పత్రికి వచ్చి మగ శిశువు ఎత్తుకెళ్లింది. వెంటనే గుర్తించిన స్వరూప రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. మగ శిశువు తీసుకెళ్లిన మహిళను గుర్తించి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసుల సమయస్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు.

Tags
#Crime News

Post a Comment

Previous Post Next Post